ముంబయి, డిసెంబర్ 21 : తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్, హిందీ చిత్రం ‘అయ్యారీ’లో నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్కు విశేష స్పందన లభించింది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్కి ఈ చిత్ర ట్రైలర్ తెగ నచ్చేసిందని, ట్విటర్ ద్వారా వెల్లడించారు. "‘అయ్యారీ’ ట్రైలర్ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో ప్రతిభ గల నటీనటులతో పాటు మంచి కాన్సెప్ట్ కూడా ఉంది. అంటూ ఈ సినిమా దర్శకుడు నీరజ్ పాండేకి బెస్ట్ విషెస్" అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. దీనికి రకుల్ ...థ్యాంక్యూ సర్, మీకు ట్రైలర్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, ఆమె రీ ట్విట్ చేశారు. కాగా, ఈ చిత్రం గణతంత్ర దినోత్సవం నాడు ప్రేక్షకుల ముందు రాబోతునట్లు చిత్ర బృందం తెలిపింది.