ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధి ఆత్మహత్య...

SMTV Desk 2017-12-21 16:10:02  suicide, triple it student, nuzevidu, krishna

నూజివీడు, డిసెంబర్ 21: చదువుల ఒత్తిడి తట్టుకోలేక కొందరు, మనస్తాపం చెంది మరికొందరు విద్యార్ధులు ఆత్మహత్యకు పాల్పడుతున్న తరుణంలో మరో విద్య కుసుమం నెల రాలిపోయింది. వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లాలోని నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న గోపీచంద్‌ నాయక్‌ అనే విద్యార్థి, ఈ రోజు మూడంతస్థుల భవనం పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన కళాశాల సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అయితే, చికిత్సపొందుతూ ఆస్పత్రిలో మృతిచెందాడు. తండ్రి కథనం ప్రకారం.. "రెండు రోజుల నుంచి ఇంటికి ఫోన్‌ చేసి మనసు కుదురుగా లేదంటూ చెప్తున్నాడు. ఇంటికి తీసుకొద్దామని కళాశాలకు బయల్దేరాను. అంతలోపే ఈ రకంగా చనిపోతాడని ఉహించలేదు" అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.