దుబాయ్, డిసెంబర్ 21 : భారత మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించిన అవార్డులలో సత్తా చాటారు. 2017లో అత్యుత్తమ ప్రదర్శన చేసి అలరించిన మహిళా క్రికెటర్లను వెల్లడించింది. ఈ జాబితాలో భారత మహిళల క్రికెట్ క్రీడాకారిణీ లు చోటు దక్కించుకున్నారు. మహిళల క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్.. "వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్", హర్మన్ప్రీత్ కౌర్.. "టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్" అలాగే ఉత్తరాఖండ్కు చెందిన ఏక్తా బిస్త్ ఐసీసీ "వన్డే, టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్" జట్లలో చోటు సంపాదించుకున్నారు. అలాగే ఐసీసీ ఉమెన్స్ ప్రపంచకప్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో బిస్త్ 5 వికెట్లను తీసి భారత్ జట్టు విజయంలో కీలక పాత్ర చేసింది. దీ౦తో "ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్" అవార్డు సైతం బిస్త్కే దక్కడం విశేషం. *ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ : ఎల్సే పెర్రీ(ఆస్ట్రేలియా) *వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ : అమి శాటర్త్వేట్(న్యూజిలాండ్) *టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ : బెత్ మూనీ(ఆస్ట్రేలియా) *ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ : బెత్ మూనీ(ఆస్ట్రేలియా)