కేవలం 30 నిమిషాల ప్రకటనకు కోటి రూపాయలు

SMTV Desk 2017-06-17 19:12:55  bhaarath, pakistan, star sports

న్యూఢిల్లీ, జూన్ 17 : భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నదంటే చాలు ఆ రోజు ఏం పనులు ఉన్న అవి త్వరగా ముగించుకొని వచ్చి టీవీలకు అతుక్కు పోతారు. అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. ఈ మ్యాచ్ ప్రసారం చేసే ఛానల్స్ కు ఇక పండుగే పండుగ, దాయాదిల పోరును ప్రసారం చేసే ఛానల్స్ కు వచ్చే రేటింగ్ మాత్రం ఒక రేంజ్ లో పెరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో దాయాది దేశాలు ఛాంపియన్స్ ట్రోఫీలో తలబడుతున్నాయి. ఇలాంటి మ్యాచ్ కు అభిమానుల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పలా, ఇలాంటి మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ ప్రసారం చేస్తుంది. ఇక ఆ ఛానల్ కు పంట పండుతోంది. ఈ మ్యాచ్ సమయంలో యాడ్ టారిఫ్ రేట్ ను పెంచేసింది. ఇతర మ్యాచ్ ల కంటే ఈ మ్యాచ్ కు ధర దాదాపు 10 రెట్లు పెంచింది. ఇప్పటికే యాడ్ గురించి కంపెనీలకు ఈ విషయం చెప్పేసింది. 30 సెకెన్ల ఈ యాడ్ కు దాదాపు కోటి రూపాయలు వాసులు చేస్తున్నారని సమాచారం.