న్యూఢిల్లీ, డిసెంబర్ 21: బుల్లితెరపై ప్రసారమయ్యే వాణిజ్య ప్రకటనలను రూపొందించి, వినియోగదారులను తప్పుదోవ పట్టించడం సరికాదని నూతన సంరక్షణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ప్రజలను మభ్యపెట్టే ప్రకటనల్లో సెలబ్రిటీలు నటించడంపై నిషేధంతో పాటు వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర వినియోగదారుల సంరక్షణ సంస్థ(సీసీపీఏ)ను ఏర్పాటు చేయనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ బిల్లు-1986 స్థానంలో 2015 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది.