కాల్పుల శబ్దంతో ఉలిక్కిపడ్డ శ్రీసిటీ సెజ్‌!

SMTV Desk 2017-12-21 12:32:37  sricity, chittoor, police, moch drill

చిత్తూరు, డిసెంబర్ 21: నిర్మానుష్యంగా పనులు జరుపుకుంటున్న చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్‌లో గురువారం ఉదయం ఒక్కసారిగా కలకలం రేగింది. రోజులాగే వివిధ సంస్థల ఉద్యోగులు, కార్మికులు తమతమ కార్యకలాపాలు చేసుకుంటున్నారు. ఉన్నట్టుండి సెజ్ లోకి ఉగ్రవాదులు ప్రవేశించారంటూ ప్రచారం జరగడంతో శ్రీసిటీ ఉలిక్కిపడింది. కాల్పుల శబ్ధం వినపడటంతో వివిధ సంస్థల ఉద్యోగులు, కార్మికులు భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ చూస్తుండగా..చివరికి పోలీసులు మాక్‌డ్రిల్‌లో భాగంగా ఇదంతా చేశారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. అత్యంత విలువైన శ్రీసిటీ ప్రాంతంలో భద్రతా కారణాల రిత్యా మాక్ డ్రిల్ నిర్వహించామని పోలీసు అధికారులు తెలిపారు. అయితే ముందస్తు సమాచారం లేకుండా ఇలా చేయడంతో ఉద్యోగులు భయబ్రాంతులకు లోనైయ్యారు.