అరుదైన రికార్డు.. ఆ తర్వాత ఔట్..!

SMTV Desk 2017-12-20 19:40:40  rohith sharma, srilanka, india, 1 st t-20

కటక్, డిసెంబర్ 20 : భారత్- శ్రీలంక మధ్య కటక్ వేదికగా జరుగుతున్న తొలి టీ-20 లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. శ్రీలంక బౌలర్ అఖిలా వేసిన 1.4 వద్ద ఫోర్ తో 15 పరుగుల పూర్తి చేసుకుని అంతర్జాతీయ టీ-20 లో 1500 మార్క్ ను చేరుకున్న రెండో ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు. కాగా రోహిత్(17) చమేరా బౌలింగ్ లో షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 68. క్రీజులో కే ఎల్ రాహుల్ (37), శ్రేయస్ అయ్యర్ (13) ఉన్నారు.