మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీడీపీ నేతలు..!

SMTV Desk 2017-12-20 16:49:32  tdp, leaders, misbehaviour, jerripotulapalem, acp arjun, case

విశాఖ, డిసెంబర్ 20: రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళ కబ్జాల పర్వానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా విశాఖపట్టణం జిల్లాలోని టీడీపీ నేతలు మహిళ అనికూడా చూడకుండా రెచ్చిపోయి ప్రవర్తించారు. జిల్లాలోని పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో ఈ దారుణం జరిగింది. భూకబ్జాను అడ్డుకున్న ఓ దళిత మహిళపై టీడీపీ నేతలు దాడి చేశారు. జెర్రిపోతులపాలెంలో దళితుల భూమిని ఎన్టీఆర్ గృహకల్ప పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలు ఆక్రమించుకునేందుకు యత్నించారు. దీనికి వ్యతిరేకంగా ఓ దళిత మహిళ అడ్డుపడ్డారు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన టీడీపీ నాయకులు ఆ మహిళపై విచక్షణారహితంగా దాడి చేశారు. రోడ్డుపై ఈడ్చుకెళ్తూ.. ఆమె బట్టలను చింపివేశారు. ఈ ఘటనపై బాధిత మహిళ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి విచారణ చేపనట్లు ఏసీపీ అర్జున్ తెలిపారు.