ఏపీ మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారు: రోజా

SMTV Desk 2017-12-20 16:47:21  mla roja, ycp, ap government, chittoor,

చిత్తూరు, డిసెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. చిత్తూరులో జరిగిన ఓ సమావేశంలో ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగినా ఏపీ మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారని విరుచుకుపడ్డారు. జిల్లాలో విజయా డెయిరీని, షుగర్ ఫ్యాక్టరీలను ఎందుకు మూసివేశారో చెప్పకుండా తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే విజయా డెయిరీని, షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని అన్నారు.