తుది శ్వాస వరకు దేశ సేవకే అంకితం : మోదీ

SMTV Desk 2017-12-20 13:58:32  prime minister modi, sensational comments, parliament,

న్యూఢిల్లీ, డిసెంబర్ 20 : ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన నాటి రోజు "నేను ప్రధానిని కాదు. దేశానికి ప్రధాన సేవకుడిని" అంటూ ప్రకటించిన మోదీ ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల విజయానంతరం మరోసారి ఉద్వేగభరితమైన వ్యాఖ్యలు చేశారు. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, సుష్మాస్వరాజ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని మొదట హాలులోకి అడుగుపెట్టగానే పార్టీ నేతలంతా నిలబడి ఆయనకు జయధ్వానాలు చేశారు. అనంతరం ప్రధాని మోదీ, అమిత్‌షాను సత్కరించారు. ఈ సందర్భంగా మోదీ ఉద్వేగానికి లోనై పై విధంగా స్పందించారు. ఆ తర్వాత సభనుద్దేశించి మోదీ మాట్లాడుతూ.. ఇది నిజంగా ఒక పెద్ద విజయం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అధికారంలో ఆ పార్టీ 18 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. ఇప్పుడు మనం 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం" అన్నారు. అధికారమనేది ప్రజల సంక్షేమానికే, వారిని సంతోషంగా ఉంచడానికే అని పేర్కొన్నారు.