కంపెనీల చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

SMTV Desk 2017-12-20 11:56:18  company act, approval, parlament

న్యూ డిల్లీ, డిసెంబర్ 20: లోక్‌సభ ఆమోదించిన కంపెనీల చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ మంగళవారం ఆమోదం తెలిపింది. దీనితో పార్లమెంటులో ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లు చట్టంగా మారనుంది. దివాళాకోరు కంపెనీలపై కఠిన చర్యలను దీనిలో ప్రతిపాదించారు. కార్పొరేట్‌ పాలనా ప్రమాణాల పటిష్ఠం, సరళతర వాణిజ్యానికీ దీనిలో నిబంధనలను సిద్ధంచేశారు. బిల్లుపై విపక్షాలు లేవనెత్తిన సందేహాలకు రాజ్యసభలో మంత్రి పీపీ చౌధరి సమాధానం ఇచ్చారు. ఐఐఎంలకు మరింత స్వయంప్రతిపత్తిని కల్పించే బిల్లుకు కూడా రాజ్యసభ మంగళవారం పచ్చజెండా ఊపింది.