కాకినాడ, డిసెంబర్ 20: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ ను అట్టహాసంగా రాష్ట్ర మంత్రి కిమిడి కళా వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ... మన కళలు, సంస్కృతి, సంప్రదాయాలపై చైతన్యం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంటి కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇస్తున్నారని తెలిపారు. యువతలో స్పూర్తి నింపేందుకు సాగర సంబరాలు వంటి ఉత్సవాలు చెపడుతున్నామని అన్నారు. అనంతరం ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, మాట్లాడుతూ.. సమాజంలో అందరూ సమానమనే భావన కోసమే ఇలాంటి వేడుకలను నిర్వహిస్తున్నామని, జిల్లాలో పర్యాటకాభివృద్ధికి రూ.350 కోట్లతో పనులు జరుగుతున్నాయని, పేర్కొన్నారు.