నేడే లంకేయులతో తొలి సమరం...

SMTV Desk 2017-12-20 11:05:58  T20 Match, india, srilanka, bhuvaneshvar, katak.

భువనేశ్వర్, డిసెంబర్ 20 : మూడు టీ-20 సిరీస్ లో భాగంగా నేడు భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టీ-20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇటీవల భారత్ తిరుగులేని విజయాలతో దూసుకుపోతూ టెస్ట్ సిరీస్ ను 1-0తో, వన్డే సిరీస్ ను 2-1తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. టీమిండియా ఈ సిరీస్ లో యువ క్రికెటర్లతో మహమ్మద్ సిరాజ్, బాసిల్ థ౦పి, జయదేవ్ ఉనద్కత్,దీపక్ హూడా వంటి కొత్త కుర్రాళ్ళతో ప్రయోగాలూ చేయాలని ఆలోచనలో ఉంది. బ్యాటింగ్ పరంగా సూపర్ ఫాంలో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్, ఇన్నింగ్స్ ను ఆరంభించగా, ధోని, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, మనిష్ పాండేలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న రోహిత్ సేనను లంకేయులు ఏ మేరకు అడ్డుకోగలరో చూడాలి. కాగా ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు భువనేశ్వర్ లోని కటక్ బరాబత్ స్టేడియంలో జరగనుంది.