విజయవాడ, డిసెంబర్ 19 : ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. జియో, ఎయిర్టెల్లను ఎదుర్కొనేందుకు తమ వినియోగదారులకు అతి తక్కువ ధరకే అన్లిమిటెడ్ డేటా, కాలింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎ.పూర్ణచంద్రరావు ఈ సేవలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మైక్రోమాక్స్ను సిమ్తో కలిపి కేవలం రూ.2200లకే (జీఎస్టీతో కలిపి రూ.2450) అందిస్తున్నామని, నెలకు రూ.97లతో రీఛార్జి చేసుకుంటే అన్లిమిటెడ్ కాలింగ్, డేటా, నేషనల్ రోమింగ్ను ఉచితంగా పొందవచ్చునని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోన్స్ అన్ని రిటైల్ షాప్ల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.