గుజరాత్, డిసెంబర్ 19 : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ, అమిత్ షా, వ్యూహ చతురతతో కమలదళం 99 సీట్లతో విజయ బావుట ఎగురవేసింది. కాగా మొత్తం 182 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో తొలి సారి బరిలోకి దిగిన కేజ్రివాల్ ఆప్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. అంతే కాకుండా ఈ పార్టీకి కేవలం రెండు చోట్ల మాత్రమే డిపాజిట్లు దక్కడం గమనార్హం. ఆమ్ అద్మి పార్టీ కంటే కొన్ని చోట్ల నోటాకే(నన్ ఆఫ్ ది అబవ్) ఎక్కువ ఓట్లు పడడం విశేషం. ముఖ్యంగా ఆప్ పార్టీ 10 స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. వాటిలో ఒక్క చోటా ఉదేపూర్లో మాత్రమే అత్యధికంగా 4500 ఓట్లు దక్కించుకొంది.