హైదరాబాద్, డిసెంబర్ 18 : ప్రముఖ హీరో సుమంత్ ఓ ఇంటర్వ్యూలో తన మాజీ భార్య, నటి కీర్తిరెడ్డితో విడాకులు తీసుకోవడానికి గల కారణం తెలిపారు. "జీవితాంతం కలిసి ఉండలేం అనుకున్నాం. కాబట్టి పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం" అని సుమంత్ చెప్పారు. అనంతరం,కీర్తి మళ్లీ పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లి కావడం నాకు సంతోషంగా అనిపించిందని, ఇప్పటికీ ఇద్దరం మంచి స్నేహితులుగా ఉన్నమన్నారు. ఆమెను చివరిసారి మా తాతయ్య (అక్కినేని నాగేశ్వరరావు) కన్నుమూసినప్పుడు కశామంటూ, గుర్తు చేసుకున్నారు. కాగా, చాలా కాలం తర్వాత ‘మళ్లీ రావా’ చిత్రంతో హిట్ అందుకున్న సుమంత్, ట్విటర్ వేదికగా ఈ సినిమాను ఆదరించిన అందరికి ధన్యవాదాలు చెప్పారు. పలువురు ప్రముఖులు సినిమా కథ, సుమంత్ నటన చక్కగా ఉందని ట్వీట్లు చేశారు.