వాషింగ్టన్, డిసెంబర్ 18 : త్వరలో యానిమేటెడ్ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. 2015లో ‘షాన్ ద షీప్’ చిత్రాన్ని నిర్మించిన నిక్ పార్క్ ఇప్పుడు ‘ఎర్లీమ్యాన్’కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 17న చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. రాతి యుగానికి చెందిన ఓ గ్రామాన్ని కాంస్యయుగానికి చెందిన వారు ఆక్రమించుకోవడంతో, ఆ గ్రామానికి చెందిన ఓ యువకుడు గ్రామాన్ని ఎలా కాపాడుకుంటాడానేదే ఈ చిత్ర కథ. అనుక్షణం ఆకట్టుకునేలా, నవ్వులు పంచేలా ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు సమాచారం. దాదాపు 50 మిలియన్ డాలర్ల బడ్జెట్తో తాజా చిత్రాన్ని తెరకెక్కించారు. వచ్చే ఏడాది జనవరి 26న ఎర్లీ మ్యాన్ న్ని విడుదల చేయాలని ఆ చిత్ర బృందం తెలిపింది. కార్టున్ తరహాలో ఉన్న ఈ చిత్రం చిన్నారులకు నూతన ఏడాదిలో బహుమతిగా ఇవ్వనున్నారు.