మీడియా సమాచారం నన్ను గందరగోళానికి గురి చేసింది : కేటీఆర్‌

SMTV Desk 2017-12-18 17:03:46  ktr twit, about gujarath elections, telangana , it minister, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 18 : గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అధికార పార్టీ బీజెపీ ప్రత్యర్ధుల ఎత్తులను చిత్తూ చేసి ఇరు రాష్ట్రాల్లో విజయ భేరి మోగించింది. అయితే ఉదయం నుండి పలు మీడియా ఛానెల్ లో వచ్చే కౌంటింగ్ ఫలితాలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ విషయం పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. "గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై ఒక్కో ఛానెల్‌ ఒక్కో విధంగా ఆధిక్యం చూపుతూ గందరగోళానికి గురి చేస్తున్నాయి. వారి అభిప్రాయాలు, ఇతర విషయాలను నేను అర్థం చేసుకోగలను. అయితే నిజాలు, సంఖ్యలు ఎలా మారతాయి" అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.