ప్రజల చూపు.. అభివృద్ధి వైపు : మోదీ

SMTV Desk 2017-12-18 16:27:02  pm modi, gujarath, bjp, himachala pardesh, bjp won

గుజరాత్, డిసెంబర్ 18 : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజెపీ పార్టీ విజయ ఢంకా మోగించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.."అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారు. మాపై ఎంతో నమ్మకంతో ఈ విజయాన్ని అందించిన ప్రజలకు నా ధన్యవాదాలు. మా పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమించిన కార్యకర్తలకు నా అభినందనలు. ఈ విజయంతో మా భాద్యత మరింత పెరిగింది. రెండు రాష్ట్రాల్లోని ప్రజల సంక్షేమానికి బీజెపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది." అని వెల్లడించారు.