అహ్మదాబాద్, డిసెంబర్ 18: దేశవ్యాప్త ఉత్కంఠ రేపిన గుజరాత్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధి, దళిత నేత జిగ్నేష్ మెవానీ భారీ విజయం సాధించారు. ఆయన 63,471 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థ బీజేపీ అభ్యర్థి చక్రవర్తి విజయ్కుమార్పై వడ్గాం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందాడు. గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన మెవానీ, అడ్వకేట్ వృత్తిలో కొనసాగుతూనే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 2017 గుజరాత్ సార్వత్రిక ఎన్నికల్లో వడ్గాం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, పాటిదార్ల సహకారంతో జిగ్నేష్ మెవానీ విజయం సాధించారు. తొలిసారి చట్టసభలకు వెళ్లనున్న ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, అసెంబ్లీలో దళిత, మైనారిటీల పక్షాన పోరాడుతానని పేర్కొన్నారు.