బెంగళూరు, డిసెంబర్ 18 : "ఎంఐ-8 ప్రతాప్ హెలికాఫ్టర్".. దేశానికి నాలుగున్నర దశాబ్దాల పాటు, అనగా 1972 నుంచి సేవలందించి౦ది. ఇకపై ఆ హెలికాఫ్టర్కు శాశ్వతంగా విశ్రాంతినిచ్చి పురావస్తు ప్రదర్శనశాలకే పరిమితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు యలహంకలోని ఎయిర్బేస్లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఎయిర్ మార్షల్ ఎస్.ఆర్.కె.నాయర్, ఇతర వైమానికదళ అధికారులు ఈ హెలికాఫ్టర్కు ఘనంగా వీడ్కోలు పలికారు.