న్యూఢిల్లీ, డిసెంబర్ 18 : ఇబ్బంది కలిగించే ట్వీట్లను తగ్గించడానికి ట్విట్టర్ ఎప్పటికప్పుడు పాలసీలో మార్పులు చేసుకుంటూ వస్తోంది. ఇటీవల కొత్తగా మరో రెండు మార్పులను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. ప్రొఫైల్లో గానీ, ట్వీట్లోగానీ అసభ్య పదజాలాన్ని ఉపయోగించిన వారిపై చర్యలు తీసుకోనుంది. ఒకవేళ ఎవరైనా అలాంటి అసభ్య పదజాలాన్ని ఉపయోగి౦చి ట్వీట్ చేస్తే వారి ఖాతాను నిలిపివేయడం గానీ, తొలగించడం గానీ చేస్తామంటూ ట్విట్టర్ ప్రకటించింది. అలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై, విధ్వంసాలు సృష్టించే వారిపై కూడా ఈ చర్యలు తీసుకోనుంది.