ఏపీలో నిర్ణయాత్మక శక్తిగా భాజపా: ఎమ్మెల్సీ సోము వీర్రాజు

SMTV Desk 2017-12-18 15:18:49  mlc, somu veerraju, ap, bjp, power

అమరావతి, డిసెంబర్ 18: గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అమరావతిలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ లో వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందని చెప్పారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టారని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికార పక్షాన్ని నిర్ణయించే స్థాయిలో ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ లోకి నాయకుల చేరిక పెరిగిందని, గ్రామ స్థాయిలో పార్టీ క్యాడర్ బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు.