ముంబై, డిసెంబర్ 18 : గుజరాత్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆది నుండి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నా.. కాంగ్రెస్ మాత్రం బీజేపీకి గట్టి పోటీనిస్తోంది. ఇందు నిమిత్తం మహారాష్ట్రలో బీజేపీ మిత్ర పక్షమైన శివసేన.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీపై ప్రశంసలు కురిపించింది. "కీలకమైన దశలో రాహుల్గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడి బాధ్యతలను చేపట్టారు. ముందుగా ఆయనకు అభినందనలు. ఓటమి భయంతో మహా మహా వారే వెనకడుగు వేస్తుండగా.. రాహుల్ గాంధీ మాత్రం ఫలితాలను పట్టించుకోకుండా యుద్ధానికి దిగారు. ఈ నమ్మకమే ఆయనను ముందుకు నడిపిస్తుంది" అంటూ ఠాక్రే వ్యాఖ్యానించారు. కాగా ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.