సిమ్లా, డిసెంబర్ 18: 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతుంది. దీనితో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయంగా కనిపిస్తుంది. కాగా రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి ప్రేం కుమార్ ధుమాల్ కాంగ్రెస్ అభ్యర్ధి రాజేందర్ రానా చేతిలో ఓటమి చెందారు. దీనితో బీజేపీ మరో ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఎంపిక చేయవలసి ఉంటుంది. ఈ ఎన్నికల్లో భాజపా 44, కాంగ్రెస్ కు 20, ఇతరులు 04 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. హిమాచల్ లో అధికార కాంగ్రెస్ ఓడిపోవడంతో భాజపా ఖాతాలో మరో రాష్ట్రం వచ్చి చేరినట్లయ్యింది.