వాషింగ్టన్, డిసెంబర్ 18: అమెరికాలోని ఇండియానా రాష్ట్రం మిడ్వెస్ర్టన్లో విమాన కుప్పకూలిపోయింది. విమానం మిస్సౌరీలోని కాన్సాన్ నగరం నుంచి మేరీలాండ్లోని ఫ్రెడరిక్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులతో పాటు ఓ శునకం కూడా మృతి చెందింది. మరో శునకానికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని ఆ శునకాన్ని వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలను, ప్రమాదానికి గల కారణాలను పోలీసు అధికారులు ఇంకా వెల్లడించలేదు.