జెరూసలేం, డిసెంబర్ 18: పవిత్ర నగరం జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిలా గుర్తిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ వివాదంలో మరో కీలక మలిపు చోటు చేసుకుంది. గాజాలోని వెస్ట్ బ్యాంక్ వద్ద పాలస్తీనియన్ ఉద్యమ నేత అయిన ఇబ్రహీం అబు తురాయను శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం కాల్చి చంపటం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. చేపలు పట్టుకుని జీవించే తురాయా 2008లో ఇజ్రాయెల్ సైన్యం నిర్వహించిన వైమానిక దాడుల్లో తన రెండు కాళ్లు కోల్పోయి వీల్చైర్కు పరిమితం అయ్యారు. అయినా కార్లు తుడుచుకుంటూ ఆయన హక్కుల పోరాటంలో పాల్గొనేవారు.