ఇసుక తవ్వకాల్లో విషాదం...ముగ్గురి మృతి

SMTV Desk 2017-12-18 13:11:28  sand, tragedy, dead, chedallacheruvu, chittoor updates

చిత్తూరు, డిసెంబర్ 18: చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చెదళ్లచెరువులో ఇసుక తవ్వకాల్లో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం ఇసుక తవ్వకాలు చేపడుతుండగా మట్టిపెళ్లలు పడి ముగ్గురు కూలీలు మృతి చెందారు. పోలీసులు జేసీబీ సాయంతో మృతదేహాలను వెలికి తీశారు. మృతులు చెదళ్ల గ్రామానికి చెందిన అనిల్‌కుమార్‌(25), జ్యోతమ్మ(45), కృష్ణప్ప(45)గా గుర్తించారు. పొట్టకుటికోసం కూలీ పనికి వెళ్ళగా ఈ దురదృష్టకర సంఘటన జరగడంతో చెదళ్ల గ్రామ౦ విషాదంలో మునిగి పోయింది. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.