ఈ విజయం ఊహించిందే: రాజ్ నాధ్

SMTV Desk 2017-12-18 12:46:38  rajnadh sing, comments, two states, election results

న్యూ డిల్లీ, డిసెంబర్ 18: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ముందుగా ఊహించినదే అని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ప్రధాని మోదీతో రాజ్ నాధ్ సమావేశమై ఈ ఎన్నికల ఫలితాలను వివరించారు. కాగా పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడానికి వెళ్తూ మోదీ విజయ సంకేతం చూపారు. దేశ ప్రజలు బీజేపీ పై విశ్వాసంతో ఉన్నారని, వారి నమ్మకాన్ని నిలబెడతామని రాజ్ నాధ్ పేర్కొన్నారు.