అహ్మదాబాద్, డిసెంబర్ 18: గుజరాత్ లో ఇప్పటికే 100 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నఅధికార పార్టీ భాజపా 2 స్థానాల్లో విజయబావుట ఎగురవేసింది. అహ్మదాబాద్లోని ఎల్లిస్బ్రిడ్జ్, దాహోద్లోని లిమ్ఖేడా నియోజకవర్గంలో భాజపా అభ్యర్థులు రాకేశ్ భాయ్ సాహ్, శైలేష్భాయ్ లు విజయం సాధించారు. మరోవైపు అహ్మదాబాద్లోని జమాల్పూర్-ఖేడియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ యూసుఫ్భాయ్ విజయం సాధించారు. ప్రస్తుతం గుజరాత్ లో 182 స్థానాలకు గాను భాజపా 105, కాంగ్రెస్ పార్టీ 74 , ఇతరులు 03 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.