ఇరు రాష్ట్రాల్లో జోరు మీదున్న బీజెపీ...

SMTV Desk 2017-12-18 11:27:12  gujarath, election result, himachala pradesh, #gujaratelection2017

గుజరాత్, డిసెంబర్ 18 : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ రెండు విడుతలుగా ఈ నెల 9,14 తేదిల్లో జరుగగా, ఓట్ల లెక్కింపు ఈ రోజు 8 గంటలకు ప్రారంభమైంది. ఇరు రాష్ట్రాలలోను అధికార బీజెపీ ముంద౦జలో ఉంది. మోదీ కంచుకోటగా భావించే గుజరాత్ లో కాంగ్రెస్ పోటీనిస్తుంది. రాజ్ కోట్ వెస్ట్ లో పోటీ చేసిన గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ కుమార్ రూపాని 30 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఫలితాలపై ప్రధాని పార్లమెంట్ కు వెళుతూ విజయ సంకేతంతో హర్షం వ్యక్తం చేశారు. గుజరాత్ లో మొత్తం స్థానాల్లో 92 స్థానాలు గెలిస్తే అధికారాన్ని చేజిక్కుంచుకోవచ్చు. పర్వత ప్రాంతం హిమాచల్ లో 68 స్థానాలకు కావాల్సిన మెజారిటీ సంఖ్య 35. ఫలితాల లెక్కింపు ఇరు రాష్ట్రాల్లో ప్రశాంతగా కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్ననికి పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.