వైజాగ్, డిసెంబర్ 17 : విశాఖలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో భారత బాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్.. శ్రీలంక పై వేగంగా అర్థ శతకం పూర్తి చేశాడు. మ్యాచ్ ఆరంభంలో రోహిత్ శర్మ తక్కువ స్కోర్ కే వికెట్ కోల్పోయినప్పటికీ శ్రేయస్, శిఖర్ ధావన్ లంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ శతక భాగస్వామ్యం నమోదు చేశారు. ఇంకా భారత్, విజయానికి 100 పరుగుల దూరంలో ఉంది. ప్రస్తుత౦ భారత్ స్కోర్ 116/1 గా ఉంది.