వైజాగ్, డిసెంబర్ 17 : వైజాగ్ లో శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో లంకేయులు స్పిన్నర్ల ధాటికి తట్టుకోలేక 215 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యారు. మ్యాచ్ ఆరంభం నుండి ఆద్యంతం సత్తా చూపిన యువ స్పిన్నర్లు కులదీప్ యాదవ్(3), చాహల్(3) వికెట్లతో లంక బ్యాటింగ్ లైనప్ ను కాకావికలం చేశారు. లంక బ్యాట్స్ మన్లలో ఉపుల్ తరంగ(95), సమర విక్రమ(42) పరుగులతో రాణించారు. హార్దిక్ పాండ్యా(2), భువనేశ్వర కుమార్, బుమ్రా చెరో వికెట్ దక్కించుకున్నారు.