షిల్లాంగ్, డిసెంబర్ 17: ఎన్నికల సందర్భంగా లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటించే ప్రధాని మోదీ అవి లేకున్నా తాజాగా ఈశాన్య రాష్ట్రాలకు భారీ ప్యాకేజీ ప్రకటించారు. ఆయన శనివారం మిజోరం, మేఘాలయ రాష్ట్రాల్లో పర్యటించారు. ఒక్క రోడ్ల నిర్మాణానికే లక్ష ఇరవైరెండువేల కోట్ల సాయం చేస్తామని ఆయన ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాల రాజధానులన్నిటినీ రైల్వే లైన్లతో అనుసంధానం చేసే బృహత్తర ప్రాజెక్టుకు రూ.47 వేల కోట్లు కేటాయించామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాల పరిపాలనలో ఈశాన్య రాష్ట్రాలు నిర్లక్ష్యానికి గురైయ్యాయని మోదీ ఆరోపించారు.