వైజాగ్ వన్డే.. శ్రీలంక 204/6

SMTV Desk 2017-12-17 16:19:29  INDIA, SRILANKA SCORES, 3rd ODI, VIZAG.

వైజాగ్, డిసెంబర్ 17 : భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక చివరి వన్డేలో ప్రత్యర్థి జట్టు తన పోరాట పటిమను ప్రదర్శిస్తోంది. లంక జట్టులో ఉపుల్ తరంగ(95), సమర విక్రమా(42) పరుగులతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని కులదీప్.. తరంగ వికెట్ ను తీసి భారత్ కు బ్రేక్ అందించాడు. తర్వాత వచ్చిన మ్యాథ్యూస్(17), డిక్వెల్(8) స్వల్ప స్కోర్ లకు పెవిలియన్ కు చేరారు. భారత్ బౌలర్ లలో చాహెల్ 3 వికెట్లు, కులదీప్ యాదవ్ 2, బూమ్రా 1 వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం లంకేయులు 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేశారు. గుణరత్నె(10), పతిరానా(6) పరుగులతో క్రీజులో ఉన్నారు.