లఖ్నవూ, డిసెంబర్ 17 : ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్నవూలోని ఒక దుకాణంలో ఓ దొంగ భారీ దోపిడీకి పాల్పడిన ఘటన అందులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయింది. లఖ్నవూలోని హసన్గంజ్ ప్రాంతంలో ఉన్న ఓ ఎలక్ట్రానిక్ దుకాణంలోకి నేడు తెల్లవారు జామున 4 గంటల సమయంలో అందులోకి ప్రవేశించిన దొంగ మొత్తం రూ.22 లక్షలు నగదును ఎత్తుకెళ్లాడు. తెల్లని దుస్తులు, ముసుగు ధరించిన ఆ దొంగ నగదు ఎక్కడేక్కడ పెడుతారో తెలిసినట్టే, తీసుకుని సంచిలో వేసుకున్న తీరును పరిశీలించిన పోలీసులు, ఈ దొంగతనం తెలిసినవారి పనే.. అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఈ కోణంలోనే దర్యాప్తు ప్రారంభించారు.