ఫైనల్ మ్యాచ్ కు భారత్ జట్టు సిద్ధం

SMTV Desk 2017-06-17 12:33:52  kohli, rohit, dhoni

బర్మింగ్ హోమ్, జూన్ 17 : ఛాంపియన్స్ ట్రోఫీ తుది దశకు చేరుకుంది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తో భారత్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. ఇక ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ భారత్ - పాకిస్తాన్ తో తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభంలోనే భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడినా, తరువాత పుంజుకుని ఫైనల్ కు చేరింది. దాయాది పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ ను తేలికగా తీసుకోబోమని భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పారు. ఈ టోర్నిలో ఇప్పటి వరకు మేం ఆడిన ఆటను మరో సారి ప్రదర్శిస్తే చాలు, ప్రత్యర్దుల బలం, బలహీనతలు తెలుసు కాబట్టి వాటికి అనుగుణంగా కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. భారత్ - పాక్ మ్యాచ్ లో ఏం జరుగుతుందో ఉహించాలేమని చెప్పారు. ఈ మ్యాచ్ కోసం జట్టు లో ఎలాంటి మార్పులు చేయడం లేదని అయన వెల్లడించారు.