ఇస్లామాబాద్, డిసెంబర్ 17: పాకిస్థాన్లోని ఓ చర్చిలో ఉగ్రదాడి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... బలూచిస్థాన్లోని క్వెట్టా ప్రాంతంలోని చర్చిలో కొందరు ఉగ్రవాదులు చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 25 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చర్చి ప్రాంగణం చుట్టూ కట్టు దిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. క్రిస్మస్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.