చివరి పోరు.. వైజాగ్ లో హోరు...

SMTV Desk 2017-12-17 11:21:09  Bharath, srilanka final one day match, vizag,

విశాఖ, డిసెంబర్ 17 : నేడు విశాఖలో భారత్, శ్రీలంకల మధ్య నిర్ణయాత్మక చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో శ్రీలంక చేతిలో పోరాడి ఓడిన భారత్.. రెండో వన్డేలో భారీ విజయంతో రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ ను 1-1 తో సమం చేశాయి. ఇప్పుడు జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా.. గత మ్యాచ్ విజయంతో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. ఇప్పటివరకు భారత్‌లో వన్డే సిరీస్‌ నెగ్గని శ్రీలంక జట్టు ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సీరీస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. కాగా ఈ మ్యాచ్ 1:30 గంటలకు విశాఖలో జరగనుంది.