పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేస్తాం: యనమల

SMTV Desk 2017-12-17 10:56:26  polavaram project, yanamala, ap government

రాజామహేంద్రవరం, డిసెంబర్ 17: పోలవరం ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో హోమియోపతి ఆస్పత్రిని ప్రారంభించిన ఆయన, అనంతరం మాట్లాడుతూ... పోలవరంపై ఎటువంటి అపోహలు అవసరం లేదని, ఉన్న గడువులోగా పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. జగన్‌ ఇచ్చే హామీలు ఎంతమేరకు నెరవేరుస్తాడో ప్రజలే ఆలోచించుకోవాలని అన్నారు.