హైదరాబాద్, డిసెంబర్ 17 : రెండు తెలుగు రాష్ట్రాలలో హల్చల్ సృష్టించిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో నిందితురాలైన స్వాతిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జైల్లో ఉన్న స్వాతి ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంత౦గా గడుపుతోంది. మొత్తం 13 మంది ఉంటున్న జైలు గదిలో ఆమెను ఉంచారు. తనకు అధికారులు 687 వ నంబరును కేటాయించారు. ఇదిలా ఉండగా స్వాతిని రిమాండ్ కు తరలించినప్పటి నుండి ఆమె ప్రతిరోజు ఉదయం యోగా చేస్తూ.. ఆ జైలులో ఉన్న నిరక్షరాస్యులైన మహిళా ఖైదీలకు అక్షరాలూ నేర్పిస్తుందని జైలు అధికారులు వెల్లడించారు.