బాల్య వివాహాల నివారణపై మరింత అవగాహన..

SMTV Desk 2017-12-16 19:21:23  BEGUMPET WOMENS MEETING, HIGH COURT CHIEF JUSTIES, RAMESH RANGANATHAN.

హైదరాబాద్, డిసెంబర్ 16 : బేగంపేటలో ఇవాళ మహిళా కమిషన్ సదస్సుకు ముఖ్య అతిథిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్ హాజరయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా బాల్య వివాహాల నివారణా చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాల నివారణపై ప్రజల్లో మరింత అవగాహన తీసుకురావాలన్నారు. ఇప్పటికి బాల్య వివాహాల వల్ల 78 శాతం బాలికలు గృహ హింసకు గురవుతూనే ఉన్నారని పేర్కొన్నారు. దీని కోసం చట్టాలను మరింత పటిష్టంగా చేపట్టాలని అన్నారు. అలాగే ఖచ్చితంగా పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాల౦టూ వెల్లడించారు.