కర్నూలు ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న చర్చలు

SMTV Desk 2017-12-16 13:49:19  karnulu, mlc notification, meeting,

అమరావతి, డిసెంబర్ 16 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఈ నెల 19న ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానున్న విషయం తెలిసిందే. శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. దీంతో నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎంపికపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కళా వెంకట్రావు, కే ఈ కృష్ణమూర్తి, కాల్వ శ్రీనివాసులు తదితరులు కర్నూలు జిల్లా నేతలతో సమావేశం కాగా, సజ్జల శ్రీధర్ రెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కేఈ ప్రభాకర్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.