భర్త మృత్యురాత రాసిన భార్య...

SMTV Desk 2017-12-16 11:39:01  husband murder, kuunool, killed,

కర్నూలు, డిసెంబర్ 16: నేటి సమాజంలో స్త్రీ మూర్తుల గౌరవానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు కొందరు మహిళలు. మరో మొగాడి మోజులో కట్టుకున్న భర్తనే కడతెర్చుతున్నారు. ఇలాంటి సంఘటనే కర్నూలు జిల్లా బ్రాహ్మణపల్లెలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... వడ్డె మద్దయ్య, వెంకటేశ్వరమ్మ లకు గత 6 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన ముల్ల మహబూబ్ బాషాతో వెంకటేశ్వరమ్మకు పరిచయం ఏర్పడి, క్రమేనా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం మద్దయ్య తెలియడంతో, ప్రియుడు బాషాతో కలిసి వెంకటేశ్వరమ్మ, మద్దయ్య మరణశాసనం రచించింది. బేతంచెర్ల మండలంలోని బలపాలపల్లెకు చెందిన మనోహర్‌, మద్దయ్యను చంపడానికి లక్ష రూపాయలకు ఒప్పుకోగా, ముందుగా 80 వేలు ఇచ్చి పని అయ్యాకా మిగితావి ఇస్తానని బేరం కుదురుచుకుంది. ఒప్పందం మేరకు మనోహర్, మద్దయ్యతో స్నేహం చేసుకొని, మద్యం తాగించి మత్తులో ఉండగా బండతో కొట్టి హత్యకు పాల్పడ్డాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా నిప్పులాంటి నిజాలు వెలుగు చూసాయి. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.