విశాఖపట్టణం, డిసెంబర్ 16: విశాఖలో జరగబోయే మూడో వన్డేకు లంక స్టార్ క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ సాధన చేస్తున్నాడని శ్రీలంక మేనేజర్ అసంక గురుసిన్హ తెలిపారు. మెహాలిలో జరిగిన రెండో వన్డేలో శతకం బాదిన మాథ్యూస్ గాయపడి, విశ్రాంతి తీసుకోని పూర్తి ఫిట్నెస్తో బ్యాటింగ్, బౌలింగ్ చేశాడని అన్నారు. అంతేకాదు ఈ రోజు మొత్తం 1 5మంది ఆటగాళ్ళు కోచ్ నిక్ పోఠాస్ నేతృత్వంలో సాధన చేశారు. మరోవైపు భారత్ తమ ఐచ్చిక సాధన శిబిరాన్ని రద్దు చేసుకుంది. రెండో వన్డేలో భారత్ లంకపై విరుచుకుపడి 141 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్ 1-1తో సమం చేసింది. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ చివరి వన్డే ఇరు జట్లకు నిర్ణయాత్మకంగా మారింది.