టీటీడీలో పెరగనున్న లడ్డూ ధరలు

SMTV Desk 2017-12-16 11:31:11  TTD, LADDU Prices

తిరుపతి, డిసెంబర్ `16 : అందరినీ నోరూరించే తిరుమల తిరుపతి దేవస్థానంలోని నేతీ లడ్డుల ధరలు పెంచనున్నట్లు తెలుస్తోంది. అయితే, కేవలం సిఫారసు లేఖలపై జారీ చేసే లడ్డూల ధరలు మాత్రమే పెంచే యోచనలో ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మేరకు కల్యాణోత్సవం లడ్డూ ధర రూ.200, వడ ధర రూ.100లుగా నిర్ణయించే అవకాశం ఉందని సమాచారం. కాగా, ఈనెల 25వ తేదీ నుంచి పెరిగే ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దర్శనంపై పొందే లడ్డూల ధరలు యథాతథంగా ఉంటాయి. సామాన్య భక్తులకు అందించే లడ్డూ ధరల్లో ఎలాంటి పెంపు ఉండదని టీటీడీ అధికారులు వెల్లడించారు.