విశాఖపట్నం, డిసెంబర్ 15 : నేటి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్లో టూరిస్ట్ వీసా ఆన్ ఎరైవల్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఎయిర్పోర్ట్లో ఈ-వీసాకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ... ఈ-టూరిస్ట్ వీసాతో ఏపీలో పర్యాటకానికి కొత్తదనం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆన్లైన్ వీసాతో విదేశీ పర్యాటకులు నేరుగా విశాఖ చేరుకోవచ్చని, దేశంలోని 16 ఎయిర్పోర్ట్లకు మాత్రమే ఈ-వీసా సదుపాయం ఉందని ఆమె వెల్లడించారు.