అమరావతి, డిసెంబర్ 15: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పరిటాల రవి గుండు కొట్టిచ్చారనే వార్త పదేపదే తెరపైకి వస్తున్న తరుణంలో పవన్ స్పందిస్తూ... నాకు ఎవరు గుండు కొట్టించలేదు.. నాకు చిరాకు కొట్టి నాకు నేనే గుండు కొట్టించుకున్నానన్నారు. ఈ విషయంపై పరిటాల రవి సతీమణి సునీత కూడా నా భర్త పవన్ కళ్యాణ్ కు గుండు కొట్టించలేదని వెల్లడించింది. అయితే ఇప్పుడు దీనిపై రోజా మాట్లాడుతూ... పవన్ తెలిపిన తేదిల వివరాల ప్రకారం పవన్ గుండు నిజమేనని, కానీ 2014లో పవన్ కు టీడీపీ మరోసారి గుండు కొట్టించిందని, 2019లో పవన్ కు మళ్లీ గుండు తప్పదన్నారు. టిడిపి కుతంత్ర బుద్దిని తెలుసుకొని పవన్ మసులుకోవాలని ఆమె హితవు పలికారు.