నెల్లూరు, డిసెంబర్ 15 : నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావుపై అవినీతి నిరోదక శాఖ అధికారులు ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేయగా, మరో రెండు కేసులు వేయనున్నారు. గతంలో మహారాష్ట్రలోని నీటిపారుదల సంస్థలో పలు కాంట్రాక్టులు నిర్వహించిన ఆయన భారీగా కుంభకోణాలు చేసినట్లు సమాచారం. దీంతో మహారాష్ట్ర ఏసీబీ అధికారులు విచారణ చేపట్టి నాలుగు కేసులు నమోదు చేశారు. పూర్తి విచారణ జరిపిన అనంతరం, మరో రెండు కేసులు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు అధికారులు ప్రయత్నించినా, వారి కళ్ళు కప్పి తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో ఈ వార్త జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతుంది.