హైదరాబాద్, డిసెంబర్ 15 : ప్రస్తుతం అనంతపురం జిల్లా ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైసీపీ అధినేత, ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అయితే, సీబీఐ న్యాయస్థానం జడ్జి సెలవులో ఉన్నందున కేసును వచ్చే శుక్రవారం 22వతేదీకి వాయిదా వేశారు. దీంతో తిరిగి వెంటనే ఆయన అనంతపురం జిల్లా ఉప్పనాసనపల్లికి బయలుదేరి మళ్లీ పాదయాత్రను కొనసాగించనున్నారు.